Saturday, January 16, 2010

శ్రీ నృసింహ జయంతి


నృసింహజయంతి అనగా నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యాక్షుని సంహరించినరోజు. హిరణ్యాక్షుని అసురసంధ్యవేళ(సూర్యాస్తమయ సమయంలో) సంహరించెను. కనుక ఈ సమయంలోనే నరసింహస్వామికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు జరుపుతారు. 

వైశాఖ శుద్ధ చతుర్దశినాడు శ్రీ నృసింహాస్వామి వారి జయంతి మనము జరుపుకుంటాము. స్వామి వారు వైశాఖ మాస శుక్ల పక్షంలొ పూర్ణిమ ముందు వచ్చే చతుర్దశినాడు ఉభయ సంధ్యలకు నడుమ అనగా సాయంకాల సంధ్యా కాలంలొ ఇటు పగలు అటు రాత్రి కానివేళ ఇటు నరుడు అటు జంతువు కాని రూపంతో అటు భూమి ఇటు ఆకాశం కాని తన తొడల పై హిరణ్యకశ్యపుని పొట్టను చీల్చి ప్రేగులు మెడలొ వేసుకొని ప్రళయ గర్జనలు చేస్తూ భూనభొంతరాళాలు దద్దరిల్లినట్టు గా సింహనాదం చేస్తూ మధ్యాహ్న సూర్యునివలె ఆవిర్భవించాడు శ్రీ నారసింహమూర్తి.

వృషభే స్వాతి నక్షత్రే చతుర్ధశ్యాం శుభేదినే |
సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భవ నృకేసరీ ||

ఈ రోజు బ్రహ్మముహూర్తంలొ లేచి తలస్నానమాచరించి శ్రీ స్వామివారిని కొబ్బరినీళ్ళతో, తేనెతో, ఆవుపాలతో, శ్రీ సూక్త, పురుష సూక్త సమన్వితంగ అభిషేకించి శ్రీ నారసింహ సహస్రనామ స్తొత్రం చేయాలి. స్వామివారికి వడపప్పు, పానకము నివేదన చేయాలి. ఈ రోజు ఉపవాసం చేయాలి. ఈ విధంగా నృసింహ జయంతి జరుపుకోవాలి.

No comments:

Post a Comment