Monday, January 25, 2010

శ్రీ హనుమజ్జయంతి


యత్ర యత్ర రఘునాధ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలీం|
బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం||

వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే ||
అంజనానందం వీరం జానకీ శోకనాశనం |
కపీసమక్ష హంతారం వందే లంకా భయంకరం ||

ఆంజనేయ స్వామి వారి జననం వైశాఖమాసం, కృష్ణపక్ష, దశమి, శనివారం, పూర్వాభాద్ర నక్షత్రంలో జరిగింది. అంజనాదేవి, కేసరీ దంపతులకు వాయుదేవుని వరప్రభావముచే ఆంజనేయుడు జన్మించాడు. శ్రీ అంజనేయ స్వామి వారి భక్తులకు ఇది ముఖ్యమైన పర్వదినము. దీనినే హనుమజ్జయంతి అని కూడా అంటాము. భక్తతులసిదాస్ కు సాక్షాత్కారం ఇచ్చి ఇప్పటికిని హిమాలయాలలో చిరంజీవిగా తపస్సు చేసుకొనుచున్నాడు. 'రామాయణంలోని అంజనేయుడు జీవించి వుంటాడా?' అని ఆశ్చర్యపోనక్కరలేదు. ఆయన చిరంజీవి అతులిత బలధాముడు మహాయోగి.

ఆంజనేయుడు పుట్టిన కొద్ది దినములలోనే సూర్యుని పండుగా భ్రమించి, మింగబోవగా ఇంద్రుడు వజ్రాయుధముతో అనువు(దవడ) మీద కొట్టగా స్పృహ కోల్పోగా వాయుదేవునికి కోపంవచ్చి ఆంజనేయుని తీసుకొని ఎవరికీ కానరాక దాగియుండెను. ఆ సమయంలో లోకములలో గాలి ఆడక జీవులన్నీ కటకటలాడిపోవగా, అప్పుడు బ్రహ్మాది దేవతలంతా ప్రత్యక్షమయ్యి ఆంజనేయుడు చిరంజీవి అనియు విశేష పరాక్రమశాలి అనియు వరములిచ్చి "హనుమ" అని పిలిచి వాయుదేవుని శాంతింపజేసిరి. అప్పటినుండి ఆంజనేయునుని హనుమంతుడు అని పిలిచారు.

హనుమంతుడు సూర్య భగవానుని వద్ద శిష్యునిగా చేరి చతుర్వేదాలు నేర్చుకున్నాడు. సుగ్రీవునికి మంత్రిగా ఉండి, రామ-సుగ్రీవులకు మైత్రిని నెలకొల్పాడు. సీతాన్వేషణకు కూడా ముఖ్య పాత్రధారి అయ్యాడు.

హనుమకు వాహనం 'ఒంటె'. హనుమకి సింధూరం అంటే ప్రీతి. ఒకనాడు సీతమ్మవారు నుదుటన సింధూరం ధరించగా హనుమ ఇలా అడిగాడంట అమ్మా నుదుటన సింధూరం ఎందుకు ధరించారు అని, అప్పుడు సీతమ్మ ఈ విధంగా సమాధానం ఇచ్చారు నుదుటన సింధూరం ధరిస్తే నా పతికి మంచి జరుగుతుంది అని. వెంటనే హనుమ ఐతే నేను నా వళ్ళంతా సింధూరం పూసుకుంటాను అలా ఐతే నా స్వామికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని అన్నాడు. అప్పటినుండి హనుమకు వళ్ళంతా సింధూరం పూస్తారు. స్వామికి తమలపాకులన్నా ప్రీతి ఎక్కువ.

ఆంజనేయ పూజితస్చేత్ పూజితా సర్వదేవతాః |
హనుమన్మహిమా శక్యో బ్రహ్మణాపిన వర్ణితుమ్ ||

భావం:
ఆంజనేయస్వామిని పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే. బ్రహ్మ దేవుడు కూడా వర్ణింపజాలని మహిమ హనుమన్మహిమ.

పూజా విధానం :


(ఈ ద్వాదశ నామాలు అనునిత్యం త్రికాలములలో జపిస్తే శత్రుభయం అనేది ఉండదు)

హనుమంతుని పటం పూజా మందిరంలో పెట్టి షొడశోపచారములతొ పూజ చేయాలి. స్వామి వారికి మనకు తోచిన నైవెద్యం పెట్టి హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణ చేయాలి. అలా చేసిన అన్ని రంగాలలోను ఎనలేని విజయం చేకూరుతుంది.

No comments:

Post a Comment