Friday, January 15, 2010

మన పండుగలు

పండుగల ప్రాముఖ్యత

ఈనాడు మనం జరుపుకునే పండుగలు శ్రీమహాభారత కర్తైన శ్రీ వేదవ్యాసుమహర్షి వేదాలనువిభజించి పురణాలను రచించి యావత్ మానవాలికి ఈ పర్వదినాలు ప్రసాధించాడు.మనం జరుపుకునే పెళ్ళి,వడుగు,బారసాల మొదలగు పుణ్య కార్యాలకు కావలసిన విధులు తెలియజేశారు. హిందు పండుగలన్నిటికి నిత్యం సంధ్య వార్చుకోవాలన్న ముందుగా మనకు 'హిందూకాలమనం' తెలియాలి. ప్రతి  శుభకార్యమునకు 'సంకల్పం' లేకుండ మంత్రకాండ జరగదు. కనుక హిందువులమైన మనం హిందూకాలెండర్ తెలుసుకోవాలి. ఇది తెలిస్తే మనకు ఏ పండుగ తర్వత ఏ పండుగ వస్తుందో, ఏమాసం తర్వాత ఏమాసం వస్తుందో  మనకు తప్పక తెలుస్తుంది.

ఇపుడు జరుగుతున్న కలియుగం యొక్క ' ఆది ' అంటే సంవత్సరం ప్రారంభకాలము (కలియుగ ప్రారంభ కాలము) ' ప్రమాది ' నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఏర్పడిన గ్రహాల కూటమితో ప్రారంభమైనది. (ఇది సుమారు 5094 సంవత్సరముల క్రితం వచ్చినది) ఆరోజు శుక్రవారం, సూర్యగ్రహణం, అమావాస్య, అర్ధ్రరాత్రి అష్టగ్రహకూటమి  అన్నీ కలిసి మేషరాశి ప్రారంభ బిందువులొ కలిసిన కలమే  మన పంచాంగాలకు మూలం. ఆనాడే శ్రీకృష్ణుని నిర్యాణం జరిగింది. అదియే హిందూ క్యాలెండర్ కు మూలస్థంభం. ఆ రోజే సంవత్సరాది ప్రారంభం. ఆ చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారం ప్రారంభమైన ' ఉగాది 'గా మారింది.

2 comments: