Friday, January 29, 2010

కృష్ణాష్టమి


        ద్వాపర యుగములో రోహిణి నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమినాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు ఈ రోజును కృష్ణాష్టమిగా జరుపుకుంటాము.ఈ రోజు వేకువతోనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తులసీదళాలు వేసిన నీటితొ స్నానం చేయాలి.అలా చేస్తే సమస్త నదుల్లొ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది.పగలు ఉపవాసం వుంటూ పూజా కార్యక్రమం జరుపవలెను. ఈ రోజు చిన్ని కృష్ణుని పాదాలు వేయడం అనవాయితి.అలా చేస్తే చిన్ని కృష్ణుడు వస్తాడని పూర్వం నుండి నమ్మకం. పూజ ముగిసిన తర్వత పాలతో  కాని, పెరుగుతో కాని, అటుకులతో  చేసిన నైవేద్యం పెట్టాలి.

శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళిః

నైవేద్యం : 

అటుకుల పాయసం:
కావలసినవి:
అటుకులు  -  పావు కేజీ,
పాలు     -  లీటరు,
చక్కెర - పావుకేజీ,
ఏలకుల పొడి - అర టీ స్పూన్,
జీడిపప్పు - పది పలుకులు,
కిస్‌మిస్   - పది
నెయ్యి   -  జీడిపప్పు, కిస్‌మిస్ వేయించడానికి తగినంత

తయారి:
ముందుగా పాలను సగానికి ఇంకే వరకు మరిగించాలి. ఈ లోపుగా అటుకులలో ఉండే సన్నని దుమ్ము, పొట్టు పోయేటట్లు నీటిలో వేసి పిండి అరబెట్టలి. పాలు కాగిన తర్వాత ఏలకుల పొడి, అటుకులు వేసి కలిపి దించేయాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌తో అలంకరించాలి.


No comments:

Post a Comment