Saturday, January 16, 2010

ఉగాది

          మనకు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు  ఉగాది పండుగ వస్తుంది. ఈ పండుగ రోజున మనము చేయవలసిన విధులు. ఉదయం 5:30 గంటలలొపు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. తిలకం ధరించి,నూతన వస్త్రములను ధరించాలి. తరువాత సూర్యభగవానునికి నూతన సంవత్సర సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి, అర్ఘ్యము, దీపం, ధూపం సమర్పించి ఆ తర్వాత "వేపపూత పచ్చడి" విధిగా తినాలి.

వేపపూత పచ్చడి:

కావలసినవి:

  1. వేపపూత 
  2. కొత్త బెల్లం
  3. కొత్త చింతపండు పులుసు
  4. మామిడికాయ తురుము
  5. పప్పుల పొడి
  6. కారం
  7. ఉప్పు


పైవన్ని కలిపి దేవుడికి నివేదించి ప్రసాదంగా మనం తీసుకొవాలి.



పంచాంగ శ్రవణం :-

ఉగాది రోజు మనం పంచాంగ శ్రవణం వినుట వలన, తిథి వలన సంపదయునూ, వారము వలన ఆయుష్యమును, నక్షత్రము వలన పాప పరిహరమును,యోగము వలన వ్యాధిని వృత్తియునూ,కరణము వలన కార్యానుకూలమున్నూ కల్గును. ఈ పంచాంగ శ్రవణం వల్ల భూమి, బంగారము, గోవులు, ధాన్యము, కన్యను దానము చేస్తే కల్గినంత ఫలితం కల్గుతుంది. అంతేకాక రాజాధి నవ నాయకుల యొక్క గ్రహ ఫలితాలను శాస్త్రొక్తంగా వినుట వల్ల గ్రహదోషములు,నివారణ అయ్యి ,వినువారికి ఆరొగ్యమూ,ఆయుష్యును,సంపదల యందు శుభఫలితాలు కల్గును.


No comments:

Post a Comment